Home » Stock Market
అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా గత మూడు సెషన్లుగా లాభపడుతూ వచ్చిన దేశీయ సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ రంగం తీవ్ర పోటీని ఎదుర్కొంటుందనే అంచనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ నేడు సరికొత్త రికార్డులతో ఉప్పెనలా దూసుకుపోయింది. పెట్టుబడిదారుల ఉత్సాహం మధ్య సెన్సెక్స్, నిఫ్టీలు చారిత్రాత్మక గరిష్టాలను తాకాయి. అంతేకాదు, అదే స్థాయిలో నిలబడ్డాయి.
బంగారం, వెండి ధరలు ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దిగి వస్తోంది. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి.
అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడం దేశీయ సూచీలకు భారీ లాభాలను అందిస్తోంది. భారత్ ఎగుమతులపై పన్నులు భారీగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు రూపాయి కూడా బలపడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై అమెరికా 20 శాతం సుంకాలు వసూలు చేస్తోంది.
నేడు సిల్వర్ ఈటీఎఫ్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ ఉదయం లోయర్ సర్క్యూట్లను తాకిన తర్వాత, మధ్యాహ్న సమయానికి కొనుగోలు మద్దతు లభించడంతో కొన్ని ఈటీఎఫ్లు 10% వరకు రికవరీ అయ్యాయి.
ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకెళ్లాయి. నిన్న (ఆదివారం ఫిబ్రవరి 1) బడ్జెట్ తర్వాత భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కోలుకున్నాయి.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆదివారం నాడు భారీగా పతనమైన దేశీయ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. మళ్లీ 81 వేల మార్క్కు చేరుకున్నాయి.
కేంద్రం.. బడ్జెట్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక ఆదివారం నాడు మదుపర్లకు భారీ షాక్నిచ్చాయి స్టాక్ మార్కెట్లు. నేడు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లకు బ్లాక్ సండే అయింది.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక ఆదివారం నాడు భారత స్టాక్ మార్కెట్లు భారీ అస్థిరతకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి.