Stock Market: నష్టాలతో ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:52 PM
వరుసగా మూడు సెషన్ల పాటు కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపర్లు మంగళవారం మాత్రం రూ.1794 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే ఐటీ, ఫార్మా, ఆయిల్ రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. ఇక, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
గరిష్టాల వద్ద మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బుధవారం దేశీయ సూచీలు నేలచూపులు చూశాయి. విదేశీ మదుపర్లు మళ్లీ అమ్మకాలకు దిగడం కూడా నెగిటివ్గా మారింది. అంతకు ముందు వరుసగా మూడు సెషన్ల పాటు కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపర్లు మంగళవారం మాత్రం రూ.1794 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే ఐటీ, ఫార్మా, ఆయిల్ రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. ఇక, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 524)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్గా మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా లాభపడి 85, 738 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 116 పాయింట్ల నష్టంతో 85, 408 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 35 పాయింట్ల నష్టంతో 26, 142 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్లో మనప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, నవుమా వెల్త్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, భారత్ డైనమిక్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హెచ్ఎఫ్సీఎల్, బీఎస్ఈ లిమిటెడ్, కోఫోర్జ్, ఐఈఎక్స్, సయింట్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 364 పాయింట్లు నష్టపోయింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.78గా ఉంది.
ఇవీ చదవండి:
భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. రికార్డులు బ్రేక్
ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి