Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. కొనసాగుతున్న నష్టాలు..
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:09 PM
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా మార్కెట్లలో నష్టాలు, ఆసియాలోని ఇతర దేశాల మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉండడం దేశీయ సూచీలకు నెగిటివ్గా మారింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు నష్టాలతోనే ముగిశాయి.
ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను కిందకు లాగాయి. రోజంతా లాభాల్లో కదలాడిన మార్కెట్లు చివరకు నష్టాలతోనే ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా మార్కెట్లలో నష్టాలు, ఆసియాలోని ఇతర దేశాల మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉండడం దేశీయ సూచీలకు నెగిటివ్గా మారింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు నష్టాలతోనే ముగిశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 559)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో 84, 780 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ కిందకు దిగివచ్చింది. ఇంట్రాడే గరిష్టంతో పోల్చుకుంటే 300 పాయింట్లు కోల్పోయింది. చివరకు సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో 84, 481 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 25, 815 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్లో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ, అశోక్ లేలాండ్, పీబీ ఫిన్టెక్, ఒబెరాయ్ రియాల్టీ, సీజీ కన్స్యూమర్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హిటాచీ ఎనర్జీ, ఐఓసీ, కమిన్స్, సన్ ఫార్మా, దాల్మియా భారత్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 203 పాయింట్లు ఆర్జించింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.24గా ఉంది.
ఇవీ చదవండి:
సూచీలకు తప్పని నష్టాలు.. వరుసగా మూడో రోజూ నేల చూపులే..
జెప్టో తొలి పబ్లిక్ ఆఫర్(IPO)..రూ.4000 కోట్లు లక్ష్యం