Home » Stock Market
మధ్యప్రాచ్యంలో ఆయిల్ ప్లాంట్లపై జరుగుతోన్న దాడుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ కూడా కనిష్టానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు గురువారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది.
ఖతార్లోని గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు పెరగడం, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయంపై ఆందోళనలు మదుపర్లను కలవరపెట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరుకుంది.
సోమ, మంగళవారాల్లో భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా మూడో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. అయితే డాలర్తో పోల్చుకుంటే రూపాయి (92.63) భారీగా పతనమైంది.
ఇరాన్ యుద్ధం నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు కోనుగోళ్లకు ఉత్సాహం చూపించారు.
ఇరాన్ యుద్ధం కారణంగా వరుసగా నష్టపోతూ వస్తున్న దేశీయ సూచీలు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు రెండు వేల పాయింట్లు పైకి వచ్చింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సూచీలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 4,354 పాయింట్ల మేర పడిపోయింది.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ద ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 75 వేల పాయింట్ల దిగువకు పతనమై.. ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది.
హోర్ముజ్ జలసంధిలో దాడుల కారణంగా ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో సూచీలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే భారత్తో సహా 16 దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని పేర్కొంటూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ సర్కారు దర్యాఫ్తునకు ఆదేశించింది.
భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.4,673 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్గా మారింది.