Home » Stock Market
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ సూచీలపై భారీ ప్రభావం చూపించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ దాడికి దిగిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతికార దాడులకు దిగొచ్చన వార్తల నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లోని ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్లోబల్ సెంటిమెంట్ బలహీనపడింది.
దేశీయ సూచీలు (Stock Market) ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ మళ్లీ 75 వేల లోపునే క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా ఆద్యంతం నష్టాల్లోనే కదలాడింది.
మీరు కోటిశ్వరులు కావాలంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు 110 రూపాయలు ఇన్వెస్ట్(investment) చేస్తే సరిపోతుంది. అవునండి ఇది నిజం. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.
భారత స్టాక్ మార్కెట్(Stock market)లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 9న) సూచీలు మొత్తం గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి. దీంతో BSE సెన్సెక్స్(Sensex) తొలిసారిగా 75,000 మార్క్ను దాటేసింది. మరోవైపు నిఫ్టీ(Nifty) కూడా 22,700 స్థాయిని బద్దలు కొట్టి సరికొత్త గరిష్టానికి చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ ఉత్సహంతో... దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఆరంభ సెషన్లో లాభాల పరుగందుకున్నాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 307.22 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 74,555.44 మైలురాయిని తాకింది. గరిష్ఠంగా 74,658.95 మార్క్ను కూడా టచ్ చేసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 79.6 పాయింట్లు వృద్ధి చెందిన ఆల్ టైమ్ గరిష్ఠం 22,593 పాయింట్ల మార్క్ను తాకింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయిగా ఉంది.
వరుసగా ఏడోసారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ ప్రభావం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ చివరకు 20 పాయింట్ల స్వల్ప లాభంతో రోజును ముగించింది.
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున దేశీయ సూచీలు లాభాల జోరు అందుకున్నాయి. మార్చిలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఈ రోజు మాత్రం ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(మార్చి 28న) ఫుల్ జోష్తో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లో విపరీతమైన కొనుగోళ్ల కారణంగా మార్కెట్లోని ప్రధాన సూచీలు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్(sensex) 927 పాయింట్ల లాభంతో 73876 దగ్గర ట్రేడైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గురువారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంది. బుల్లిష్ ట్రాక్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 22000 దాటింది.