Home » Stock Market
స్టాక్ మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్ను దశలవారీగా రద్దు చేయాలని SEBI భావిస్తోంది. మొదట్లో వీటిని.. మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి, షార్ట్-టర్మ్ హెడ్జింగ్ కోసం తీసుకొచ్చారు. అయితే, వీటిని ఇప్పుడు క్విక్ స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం ఉపయోగిస్తున్నారు.
చైనా-అమెరికా ట్రేడ్ వార్ అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. ఆ ప్రభావంతో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలతోనే ముగిశాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధం ముగియడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపినప్పటికీ, చైనా-అమెరికా ట్రేడ్ వార్ ఆందోళన కలిగించింది. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి.
చైనాపై ట్రంప్ సుంకాల హెచ్చరికలతో దేశీ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడింది. ఊహించినట్టుగా దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
బుధవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫైనాన్సియల్ రంగంలో అమ్మకాలు సూచీలకు నెగిటివ్గా మారాయి. దీంతో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఒక దశలో 82 వేల మార్క్ దాటిన సెన్సెక్స్ మళ్లీ కిందకు దిగి వచ్చింది.
వరుసగా ఐదో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 82 వేల మార్క్ దాటేసింది. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ నిఫ్టీ 25 వేల మైలురాయిని చేరుకోవడం విశేషం.
ఒక పెద్ద మనిషి చేసిన పని ఇప్పుడు ఆ ఇంటికి బంగారు గని దొరికినంత పనైంది. పాత కాగితాలు తీసి చూస్తుండగా ఒక కాగితం ఇంట్లో వాళ్ల కంటపడింది. అదేంటని తరచి చూస్తే, అవి షేర్ల పేపరు. అప్పట్లో వెయ్యిరూపాయలతో కొన్న ఆ షేర్లు ఇప్పుడు..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 7న) వరుసగా రెండో రోజు పాజిటివ్ ట్రెండ్తో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 రెండూ కొత్త రికార్డుల్ని తాకాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు సానుకూలాంశంగా మారడంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలను లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈ రెండు రంగాల్లోని పలు స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.