Stock Market: సూచీలకు లాభాల జోష్.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 04 , 2025 | 10:31 AM
జీఎస్టీ సంస్కరణలు దేశీయ సూచీలకు మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. గత వారం నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారం లాభాల్లో చలిస్తున్నాయి. జీఎస్టీ నూతన సంస్కరణలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు భారీగా లాభపడుతున్నాయి.
జీఎస్టీ సంస్కరణలు దేశీయ సూచీలకు మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. గత వారం నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారం లాభాల్లో చలిస్తున్నాయి. జీఎస్టీ నూతన సంస్కరణలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు భారీగా లాభపడుతున్నాయి. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు దేశ అభివృద్ధికి సహకరిస్తాయని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి (Business News).
బుధవారం ముగింపు (80, 567)తో పోల్చుకుంటే గురువారం ఉదయం భారీ లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ ట్రెండ్ను కొనసాగిస్తోంది. గురువారం ఉదయం దాదాపు 900 పాయింట్ల లాభాంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. దాదాపు అన్ని రంగాలు లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 457 పాయింట్ల లాభంతో 81, 024 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 138 పాయింట్ల లాభంతో 24, 853 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్లో ఎమ్ అండ్ ఎమ్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, కోల్గేట్, పీబీ ఫిన్టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పేటీఎమ్, కల్యాణ్ జువెల్లర్స్, పిరామిల్ ఫార్మా, కోఫోర్జ్ లిమిటెడ్, సెయిల్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 152 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.09గా ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి