Stock Market: లాభాలతో ప్రారంభం.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:37 AM
జీఎస్టీ సంస్కరణలు దేశీయ సూచీలకు మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. జీఎస్టీ నూతన సంస్కరణలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు ఈ వారాన్ని కూడా లాభాలతో ప్రారంభించాయి. ఈ నెల 12వ తేదీన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతున్నాయి.
జీఎస్టీ సంస్కరణలు దేశీయ సూచీలకు మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. జీఎస్టీ నూతన సంస్కరణలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు ఈ వారాన్ని కూడా లాభాలతో ప్రారంభించాయి. ఈ నెల 12వ తేదీన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతున్నాయి. ఇక, జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు దేశ అభివృద్ధికి సహకరిస్తాయని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో కొనసాగుతున్నాయి (Business News).
గత శుక్రవారం ముగింపు (80, 710)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ ట్రెండ్ను కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడి 81 వేల మార్క్ను కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 80, 813 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 42 పాయింట్ల లాభంతో 24, 783 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్లో భారత్ ఫోర్జ్, సోనా బీఎల్డబ్ల్యూ, టాటా మోటార్స్, సెయిల్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అంబర్ ఎంటర్ప్రైజెస్, వేదాంత, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అవెన్యూ సూపర్ మార్కెట్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 377 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో కొనసాగుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.27గా ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి