Home » Stock Market
ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మొదటి రోజున ఐపీఓ ధరతో పోల్చుకుంటే 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి లాభాలను పంచింది. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి.
మంగళవారం ఉదయంతో పోల్చుకుంటే బుధవారం ఉదయం బంగారం ధర గ్రాముకు వెయ్యి రూపాయిల మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 10న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు రావడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంపై బుధవారం సమావేశం కానుంది.
గత కొన్ని రోజుల్లో ఇండిగోకు చెందిన వందల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందడంతో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై కూడా స్పష్టంగా కనబడుతోంది
డాలర్తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రూపాయి క్షీణిస్తుండడం స్టాక్ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది.
గత మూడు సెషన్లుగా నష్టాలనే చవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అయితే డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.90.43) మరింతగా క్షీణించడంతో ఆందోళన తప్పలేదు.
విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగుతున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
సోమవారం విదేశీ మదుపర్లు రూ.1, 171 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి.
ఉదయం భారీగా లాభపడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నేల చూపులు చూశాయి. రూపాయి పతనం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు సిద్ధమవుతోంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతు కలిగిన మీషో 5, 421 కోట్ల రూపాయల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి సబ్స్క్రిప్షన్కు అందుబాటులోకి రానుంది. ఈ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ 5తో పూర్తి కాబోతోంది.