Home » Sports
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు భారీ ధరకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రతి ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అందరిదీ ఒకటే ప్రశ్న.. ధోనీకిదే ఆఖరి సీజనా? తాజాగా అతడి రిటైర్మెంట్పై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్తుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ తర్వాత ఆర్సీబీకి ఆర్యమాన్ బిర్లా కొత్త ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్, కేకేఆర్ లెజెండరీ ఆండ్రూ రస్సెల్ ఈ సీజన్కు ముందు ఐపీఎల్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ సంచలన ప్రకటన చేశాడు. తాను ఐపీఎల్ 2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 రన్నరప్గా నిలిచిన లక్ష్య సేన్ థామస్ కప్లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే వచ్చే నెలలో జరిగే ఉబెర్ కప్నకు మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, యువ క్రీడాకారిణి ఉన్నతి హూడా మహిళల జట్టుకు నాయకత్వం వహించనున్నారు.
ఐపీఎల్2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే భారీ డీల్ కుదిరినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కన్సార్టియం అనే సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్కు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్గా యోగి సర్కార్ నియమించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తుంది. బంగ్లా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తకు బలం చేకూరుస్తున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్2026కి తమ ఆటగాళ్లను దూరంగా ఉంచాలనే యోచనలో బీసీబీ ఉన్నట్లు సమాచారం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ ఐపీఎల్2026కి దూరంగా కానున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఆడటం లేదని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ అన్నారు.