Home » Sports
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ టెస్టు జట్టుకు మళ్లీ అనుభవజ్ఞుడైన జో రూట్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించడంతో రూట్ మరోసారి టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి తదుపరి ఈవెంట్ ఏంటని తెలుసుకునేందుకు క్రీడాభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. ఇవాళ బాక్సింగ్ విభాగంలో భారత్ ఈ రెండు పసిడి పతకాలను సాధించింది. మహిళల 54 కేజీలు, 57 కేజీల విభాగాల్లో భారత్ అథ్లెట్స్ గోల్డ్ మెడల్స్ గెలిచారు.
కామన్వెల్త్ గేమ్స్2026లో భారతదేశానికి పతకాలు అందించిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జావెలిన్ త్రోలో రజతం గెలిచిన నీరజ్ చోప్రా, కాంస్య పతక విజేత యశ్వీర్కు శుభాకాంక్షలు తెలిపారు.
భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పుపై కొనసాగుతున్న వివాదానికి హాకీ ఇండియా మరోసారి వివరణ ఇచ్చింది. అధ్యక్షుడు దిలీప్ టిర్కీ దీని ఆమోద ప్రక్రియపై వివరణకు ఆదేశిస్తూ.. అధికారులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి డైరెక్టర్ జనరల్ కమాండర్ ఆర్.కే శ్రీవాస్తవ నాలుగు పేజీల సమాధానం పంపారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించాడు. హైజంప్ విభాగంలో ఫైనల్ పోరులో మోకాలి గాయం తిరగబెట్టడంతో ఒక్క జంప్ కూడా నమోదు చేయలేక కన్నీళ్లతో మైదానాన్ని వీడిన తేజస్విన్.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే డెకాథ్లాన్లో చరిత్ర సృష్టించాడు.
భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్.. పాకిస్థాన్ క్రికెటర్ ఫాతిమా సనాను హత్తుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకోవడంపై స్పందించాడు. తనతో పాటు భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్ కూడా పోడియంపై నిలవడం తనకెంతో ఆనందంగా అనిపించిందని తెలిపాడు.
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై వస్తోన్న విమర్శలకు ఆ జట్టు సెలెక్టర్ ప్రవంజన్ మల్లిక్ సమాధానమిచ్చారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక్క బౌట్ కూడా గెలవకుండానే తువాలు దేశానికి చెందిన మహిళా బాక్సర్ తరోనా తఫాకీ కాంస్య పతకాన్ని అందుకుంది. దీంతో దక్షిణ పసిఫిక్లోని చిన్న ద్వీప దేశమైన తువాలు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలి పతకాన్ని సొంతం చేసుకుంది.