Home » Singareni
భూపాలపల్లి జిల్లా సింగరేణి గనుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గనికి సంబంధించిన ల్యాంప్రూమ్లో మంటలు వ్యాపించాయి. గనిలో పనిచేసే కార్మికులకు సంబంధించిన 1500 ల్యాంప్లు మంటల్లో కాలిపోయాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని తెలిపారు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం లోక్ భవన్కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతలు కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు.
సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతూ, కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహించారు.
నైనీ కోల్ టెండర్ల వివాదంపై కేంద్ర బృందం విచారణ ప్రారంభమైంది. సింగరేణి భవనానికి చేరుకున్న బృందం... సీఎస్ఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి అంశాలపై ఆరా తీస్తోంది.
సింగరేణిలో డైరెక్టర్ల సంఖ్యను పెంచుకుని సంస్థపై పట్టు సాధించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందా? నైనీ కోల్బ్లాక్ టెండర్లు వంటి వివాదాలు, సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుండటం నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపడుతోందా?..
సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి భూముల్లో అనేక ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే చర్యలకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి నుంచి వచ్చిన రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పంచానుంది. దసరా కానుకతో పాటు మరో కానుకను కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.