Home » Seethakka
నిర్భయ నిధి కింద తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ములుగు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యం ఆధారంగా త్వరగా పూర్తి చేస్తామని మంత్రులు తెలిపారు. భూసేకరణ పూర్తయ్యాక సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని మంత్రులు వెల్లడించారు.
మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు..
కేరళ రాష్ట్రంలో అమలు చేసిన కుటుంబశ్రీ మోడల్ను అనుసరించి.. తెలంగాణలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ పథకం ద్వారా అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామన్నారు.
ములుగు జిల్లా కన్నెపల్లి ఆలయంలో సారలమ్మ కాసేపట్లో మేడారం బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య కన్నెపల్లి పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పూనుగొండ్ల నుంచి మేడారం దిశగా పగిడిద్దరాజు ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది. కోయ పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పగిడిద్దరాజును మేడారం తీసుకొస్తున్నారు. మేడారం జాతరకు ముందుగా జరిగే ఈ కార్యక్రమం గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.
బీఆర్ఎస్పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయాక ఎవరో వాళ్ళ ఇంట్లో పడి గుంజుకున్నట్టుగా ఫీలై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.