Home » Seethakka
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పూనుగొండ్ల నుంచి మేడారం దిశగా పగిడిద్దరాజు ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది. కోయ పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పగిడిద్దరాజును మేడారం తీసుకొస్తున్నారు. మేడారం జాతరకు ముందుగా జరిగే ఈ కార్యక్రమం గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.
బీఆర్ఎస్పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయాక ఎవరో వాళ్ళ ఇంట్లో పడి గుంజుకున్నట్టుగా ఫీలై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు.
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలన్నారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ గెలుపుకు కారణమని అన్నారు.
గతంలో నచ్చని ఓట్లను తీసేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు అని విమర్శించారు. ప్రస్తుతం కారుకు పంక్చర్ అయింది.
మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో PCC చీఫ్కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క స్పష్టతనిచ్చారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయని ఆమె తెలిపారు.
గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఆదివాసి గిరిజనులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారన్నారు.