Home » Savitha
హత్యలు చేయటం, సాక్షుల్ని బెదిరించటం, రేటు మాట్లాడటం, కుటుంబసభ్యులను, జడ్జిలను బెదిరించాలని చూడటం మాజీ సీఎం జగన్కు అలవాటని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
కడప జిల్లాలో విద్యార్థిని హత్య కేసుపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని హత్య అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు.
వడ్డెర్ల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమితోనే వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు అని అన్నారు.
పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, కూటమి సర్కార్పై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో నేతన్నలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసింది..
పెనుకొండలో.. ఇస్కాన్ బేస్ క్యాంప్ ఏర్పాటుకానుంది. మొత్తం 60 ఎకరాల స్థలంలో రూ.425 కోట్లతో దీని నిర్మాణం జరగనుంది. కాగా.. ఈ బేస్ క్యాంపు నిర్మాణం ద్వారా ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుతో 1035 మందికి ప్రత్యక్షంగా 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి సవిత తెలిపారు
తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు.
పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబే... అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హాయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి అన్నారు.
కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.