Home » Sachin Tendulkar
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్ పర్యటనలో ఆనందంగా గడుపుతున్నారు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి కశ్మీర్లోని అందమైన ప్రదేశాలన్నింటిని చుట్టేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తాను గతంలో చెప్పినట్టుగానే ప్రముఖ పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్ను కలిశాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్.. జమ్మూకశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీర్ను తన హోటల్ గదికి ఆహ్వానించాడు.
సచిన్ టెండూల్కర్. ఈ పేరుతో క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన పేజీలున్నాయి. తన ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దేశంలో అయితే సచిన్ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. క్రికెట్కు సచిన్ చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నతో గౌరవించింది.
భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు రెండవ బిడ్డ జన్మించారని విరాట్ సోషల్ మీడియా వేదికగా నిన్న రాత్రి వెల్లడించారు. ఈ క్రమంలో సచిన్ సహా పలువురు ప్రముఖులు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంత మంది వినూత్నంగా పోస్టులు చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆల్టైమ్ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బద్దలుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 29 పరుగులు చేసిన రూట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ సచిన్ రికార్డును అధిగమించాడు.
జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అతిరథ మహారథుల మధ్య ఒక పండుగలా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో.. ఈ వేడుకలో కొన్ని కీలక ఘట్టాలు కూడా చోటు చేసుకున్నాయి.
రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.
Arjun Tendulkar: రంజీ ట్రోఫి 2024లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్లో అర్జున్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా కర్ణాటకతో మొదలైన మ్యాచ్లో జట్టును కష్టకాలంలో ఆదుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లంతా కలిసి ఆడిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ మ్యాచ్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు, అన్నాదమ్ములైన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Sachin Tendulkar: భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ సిరీస్కు సమయం ఆసన్నమైంది. రెండు జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. రెండు జట్ల మధ్య చివరగా జరిగిన టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగింది.