Home » Sabarimala
శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ మరో అరెస్ట్ చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడైన పద్మకుమార్ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
హరిహర తనయుడు అయ్యప్పను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మండలపూజ, మకర విళక్కు మహోత్సవ సమయంలో లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలధారణతో శబరిగిరీశుడిని దర్శించుకునేందుకు కోట్లాదిమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. అదంటంటే..
కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరు కాన్వాయ్లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు.
శబరిమల గర్భగుడి ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాల కాంట్రవర్సీ కొనసాగుతోంది. ఈ అంశంపై కేరళ హైకోర్టులో కూడా విచారణ జరగుతోంది. అయితే, తాపడాలకు ఏమైందనే విషయంలో జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.
కేరళ శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి బంగారం చోరీ జరిగిందన్న ఆరోపణలపై కేరళ హైకోర్టు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు గోప్యంగా ఉండాలని..
విగ్రహ తాపడాలు మరమ్మతు అనంతరం తిరిగి సన్నిధానం చేరుకున్నాయని, సంబంధిత తాంత్రి పూజాదికాలు నిర్వహించిన అనంతరం విగ్రహాలకు వాటిని అమర్చడం జరుగుతుందని టీడీబీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
పినరయి విజయన్ తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలను ఉంటకించారు. నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతమని, సుఖదుఖాలతో సమత్వం కలిగి ఉంటారని అన్నారు. శబరిమల కుల, మతాలకు అతీతమని, అన్ని మతవిశ్వాస వారు ఈ యాత్రను చేపడతుంటారని చెప్పారు.
మకర సంక్రమణ సమయంలో.. కాంతమలైగా పిలిచే పొన్నంబలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు శబరికొండకు తరలివస్తున్నారు.
శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తుంటారు. ప్రతి సంక్రాంతి పండుగ రోజు దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది.
సంక్రాంతి రోజున మకరజ్యోతిని దర్శించుకునేందుకు కొండకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.