Home » Road Accident
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ సంఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి కారును సంఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయాడు.
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హయత్నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రుండ్ వద్ద మస్రుండ్-చంబా రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తుర్కపల్లి - మురహరిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని పండరీపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులను తీసుకెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోవడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల లారీ యార్డ్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతిచెందారు.
బిహార్లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు.