Home » Revanth Reddy
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సిట్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు? అని ప్రశ్నించారు.
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో.......
ఏపీలోనూ మైనర్ల సోషల్ మీడియా నిషేధంపై ఆలోచిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేశ్. దావోస్ పర్యటనలో భాగంగా బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
డక్టయిల్ ఐరన్(డీఐ) పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్... తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది....
దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ విజన్–2047, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అభివృద్ధి, యువత నైపుణ్యాల అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాలు సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జ్లను నియమిస్తున్నామని తెలిపారు.
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో సీఎం రేవంత్ రెడ్డితో సర్గడ్ సంస్థ సీఈఓ సమావేశమయ్యారు. తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సర్గడ్ సంస్థ ముందుకు వచ్చింది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.