Home » Revanth Reddy
ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్టాత్మక రామోజీ ఎక్స్లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్లెన్స్ అవార్డులను ప్రధానం చేయనున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది! సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతై.....
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట సీఎం రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్లో ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించబోతోంది. ప్రపంచ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి, వ్యాపార, ఆర్థిక రంగాలలో ప్రగతిని చర్చించేందుకు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైంది. పోస్టల్ బ్యాలెట్ మొదలు.. రౌండ్ రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ గెలుపుతో రేవంత్ వ్యూహం ఫలించినట్లైంది.
హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం అన్నారు.....
గత 23 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం హైదరాబాద్లో ఉందని తెలిపారు.
తనకు, ముఖ్యమంత్రికి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులతో తనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓట్ల చోరీ తెలంగాణలోనూ జరిగిందని..
అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని గుర్తుచేశారు. ఈ విషయంపై ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహకరించాలని కోరారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ఘట్కేసర్లో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలి వచ్చారు. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాల్గొన్నారు.