Home » Republic day
ఢిల్లీ: భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్(US), న్యూఢిల్లీ(Delhi) మధ్య 21వ శతాబ్దంలో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటోందని రూబియో చెప్పారు.
అమరావతి: 76వ గణతంత్ర దినోత్సవానికి భారతదేశం ముస్తాబైంది. దేశ రాజధాని ఢిల్లీ సహా అన్నీ రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీలో దేశ ప్రజలకు నాయకత్వం వహించనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో ఈసారి గణతంత్ర వేడుకలు ప్రత్యేకంగా జరగనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారతదేశ చరిత్రలో అతిపెద్ద దినోత్సవమైన గణతంత్ర దినోత్సవం ఈ ఏడాది 76వ సంవత్సరం జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంగా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
గణతంత్ర దినోత్సవం వచ్చేసినా ఖైదీల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఆయా కుటుంబాల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రగతి లక్ష్యాల దిశగా భారతదేశం నిజమైన ప్రయాణం సాగిస్తోందని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదుగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
'నీట్' అంశంతో సహా రాష్ట్రంలోని పలు అంశాలపై గవర్నర్, డీఎంకే మధ్య చాలాకాలంగా సయోధ్య లేదు. తమిళనాడులోని విశ్వవిద్యాలయలకు వీసీల నియామకం విషయంలో గవర్నర్కు, డీఎంకే ప్రభుత్వాన్ని మధ్య జరుగుతున్న గొడవపై ఇటీవలే రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
76వ గణతంత్రి దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అనేక రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే పరేడ్లో భాగం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం.
Wine Shops: జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా వైన్ షాపులు ఉండవు. ఈరోజు రాత్రి నుంచే మద్యం దుకాణాలు క్లోస్ అవుతాయి. అలాగే బార్లు, పబ్స్ కూడా మూసివేస్తారు. దీంతో అలర్ట్ అయిన మద్యం ప్రియులు ముందుగానే వైన్ షాపుల ముందు వాలిపోయి తమకు కావాల్సినంత మద్యాన్ని కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు.