Home » Rajastan
4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూలు భవనంలోని నాల్గవ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది.
నగలు దొంగిలించేందుకు ఇంట్లోకి చొరబడిన ఓ మహిళ చివరకు అదే ఇంట్లో బందీ అయిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. బయటపడేందుకు దారి కనిపించకపోవడంతో ఏకంగా ఇంటి యజమానినే బెదిరిస్తూ 'బట్టలు విప్పేస్తా.. పోలీసులకు ఫోన్ చేస్తా.. మీపై కేసు పెడతా' అంటూ హైడ్రామాకు తెరలేపింది.
రాజస్థాన్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గనుక ఇప్పుడు బతికుంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
జైపూర్లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన జపాన్కు చెందిన మహిళా టూరిస్ట్ను కొంతమంది యువకులు వేధింపులకు గురిచేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ జిల్లా ఝలారియా గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. భగీరథ్ అనే మూడేళ్ల బాలుడు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటి ‘సూపర్ మ్యాన్’ఫేం వాలెరీ పెర్రీస్ కన్నుమూసిన విషయం మరవక ముందే మరో యువ నటి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.
భారత్ ఎయిర్ఫోర్స్లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన సుమిత్ కుమార్ అనే వ్యక్తి పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులకు సమచారం అందింది.