జైపూర్ బాలిక ఆత్మహత్య ఘటన.. వీడియో విడుదల చేసిన కుటుంబం..
ABN , Publish Date - Jul 10 , 2026 | 01:04 PM
4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూలు భవనంలోని నాల్గవ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూలు భవనంలోని నాల్గవ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది. బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు క్లాస్ రూములో ఏం జరిగిందో తెలిపే వీడియో అది. క్లాస్ రూములో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఆ వీడియోలో ఏముందంటే.. అమైరా మీనా క్లాస్లోకి రాగానే తోటి విద్యార్థులను పలకరించింది. తర్వాత తన బెంచ్లో కూర్చుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థులు ఆమె దగ్గరకు వచ్చి వేధించటం మొదలుపెట్టారు. పదే పదే తోటి విద్యార్థులు తనను వేధిస్తుండటంతో బాలిక తట్టుకోలేకపోయింది. క్లాస్ టీచర్కు విషయం చెప్పింది. టీచర్ దాన్ని పట్టించుకోలేదు. దీంతో అమైరా కోపంగా క్లాస్ రూము నుంచి బయటకు వచ్చేసింది. నాల్గవ అంతస్తులోకి చేరుకుంది. అక్కడి సేఫ్టీ వాల్ మీదకు ఎక్కి దూకేసింది.
బాలిక తల్లిదండ్రులు చెబుతున్న దాని ప్రకారం.. అమైరా మీనా దాదాపు 18 నెలల పాటు నరకం చూసింది. కొంతమంది విద్యార్థులు ఆమెను బాగా వేధించారు. టీచర్లకు విషయం చెప్పినా వారు పెద్దగా పట్టించుకోలేదు. తోటి విద్యార్థులు అమైరాను బూతులు తిట్టారని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీనిపై చాలా సార్లు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు కూడా చేశామని అంటున్నారు. స్కూలు టీచర్లు పట్టించుకోకపోవటం వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపండి.. రైతులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?