Home » Rains
తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.
హైదరాబాద్ సిటీలోని ప్రజలు ప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉత్తర ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే ఐదురోజులపాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్ మేఘాలు అలుముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా అవి జోరువానగా మారాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది.
వాతావరణంలో ఏర్పడిన మార్పులతో రాగల మూడు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.