Home » Rains
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి.
మూసీ ఒడ్డున ఉన్న మహాత్మగాంధీ బస్స్టేషన్(MGBS) నీట మునిగింది. వరద నీరు స్టేషన్లోకి చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సిన, వివిద ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
మహానగరాన్ని మరోసారి వరణుడు వణికించాడు. మూసీ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నది పక్కనున్న బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం.. జంట జలాశయాల గేట్లు తెరిచారు.
30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పఇన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన తూత్తుకుడి జిల్లా జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఆగిపోయారు.
ఎమ్జీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు తగ్గటం లేదు. పక్కనే ఇప్పటికే ఎమ్జీబీఎస్ బ్రిడ్జ్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచంద సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.
ఈ రోజు (శనివారం) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.