Home » Rains
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. భారీగా వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 360, గోపాల్పూర్కు 360 కిటోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, పూరీకి 390 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి, గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ, విమానయాన సంస్థలు కీలక ప్రకటనలు జారీ చేశాయి.
శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీగా వరద నీరు బస్టాండ్లోకి రావటంతో రాకపోకలు నిల్చిపోయాయి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతోండటంతో చెరువులు, వాగులకు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే, యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. జూలూరు - రుద్రవల్లి బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతి పొటెత్తింది.
నగరంలో భారీ వర్షం కురుస్తోంది. రోజూ మాదిరే ఇవాళ (శనివారం) రాత్రి కూడా ఎనిమిది గంటల నుంచి భారీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దవుతున్నారు. వాహనదారులు..
హైదరాబాద్ను వరణుడు వణికిస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్న రోడ్లు, ఇండ్లు నీటమునిగాయి. ఇందుకు సంబంధించిన LIVE UPDATES ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.