Home » Rain Alert
ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా వారాలపాటు కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వర్షాల దెబ్బకు భారీ వదరలు వచ్చి అపార నష్టాన్ని మిగిల్చాయి. రికార్డుస్థాయిలో వరదలు ముంచెత్తి ఆస్తి, పటం నష్టాలతోపాటు ప్రాణ నష్టం కలిగించి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.
రాష్ట్రంలో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కోతకు గురవుతూనే ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
గ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్లో పలు జిల్లాలను రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వానలు ముంచెత్తాయి.
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం నాటికి బలహీనపడనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో వాతావరణం అల్పపీడనాలు/తుఫాన్లకు అనుకూలంగా మారింది. గత నెలలో ఒక తుఫాన్ రాగా, ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుంది. ఈనెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడనుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది.
ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనిపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతోంది.