Home » Putin
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో దేశ ప్రధాని నరేంద్ర మోదీది ప్రత్యేకమైన అనుబంధం. నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధాని అయిన తర్వాతే పుతిన్తో పరిచయం ఏర్పడిందని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. అంతకు 13 ఏళ్ల ముందే మోదీ, పుతిన్ మధ్య స్నేహం మొదలైంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగిన పుతిన్కు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య భారీ రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య రెండు బిలియన్ డాలర్ల విలువైన సబ్మెరిన్ డీల్ కుదరనుందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
భారత్, రష్యా దేశాలు మధ్య ఒక కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. రష్యా పార్లమెంట్ ఈ ట్రీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం..
ఇండియా-రష్యా 23వ వార్షిక సదస్సుకు పుతిన్ను ప్రధాని మోదీ ఆహ్వానిస్తూ, ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలియజేశారు. భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 5-6 తేదీల్లో ఇండియాకు రానున్నారు.
భారత్పై ట్రంప్ విధించిన ఆంక్షలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని నాటో చీఫ్ మార్క్ రట్ అన్నారు. ఉక్రెయిన్పై ప్రణాళికల గురించి వివరించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారని తెలిపారు.
అత్యంత క్లిష్ట సందర్భాల్లో కూడా భారత్-రష్యా భుజం భుజం కలిపి నడిచాయని, ఇరుదేశాల సంబంధాలు ప్రపంచశాంతికి, సుస్థిరతకు కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఎస్సీఓ కాన్ఫరెన్స్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న రిట్జ్-కార్లటన్ హోటల్ వరకూ మోదీతో కలిసి ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ అనుకున్నారని, మోదీ కోసం 10 నిమిషాల పాటు వేచి చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
షాంఘై సహకార సదస్సు కోసం చైనాలోని తియాన్జిన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సరదాగా గడిపారు. పుతిన్ను కౌగిలించుకుని, ఆయన చేతిలో చేయి వేసి పట్టుకుని నవ్వుతూ మాట్లాడారు. ఇదే సమావేశానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు.
చైనాలోని టియాంజిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. మోదీ, పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు.