Home » Pulivendula
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది పార్టీని వీడగా.. తాజాగా జగన్ సొంత ఇలాకాలో కీలక నేతలు వైసీపీకి గుడ్బై చెప్పారు.
కొంతకాలంగా అరటి ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే నాలుగైదు రోజులుగా అరటి ధరలు పెరుగుతున్నాయి.
మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కు సొంత నియోజకవర్గ ప్రజలు మరో షాకిచ్చారు. తాజాగా ఇవాళ రెండు వందల మైనారిటీ కుటుంబాలు వైసీపీకి తిలోదకాలిచ్చి టీడీపీ కండువా కప్పుకున్నారు.
ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జగన్ కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేసింది. ఒంటిమిట్టలోనూ టీడీపీ దూసుకుపోతోంది. ఈ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ మీకోసం ABN ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది.
జగన్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.