Home » Prakasam
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ఏమాత్రం కనికరం లేకుండా దారుణంగా హత్య చేసింది భార్య. ఇందు కోసం తన తమ్ముడి సహాయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత జాకీర్ మృతిచెందారు. జాకీర్ మృతి పట్ల మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రకాశం జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. నాగేశ్వరరావు అనే వ్యక్తి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్డ్ అయ్యారు.
దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడమే జగన్ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నారంటే జగన్ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.
పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెంమంత్రి అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
మెడికల్ కాలేజీలను ఎవరికీ దారాదత్తం చెయ్యడం లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వైసీపీ చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.