Home » Prakasam
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ(గురువారం) శాసన సభలో అంగన్వాడీల అంశంపై చర్చించారు.
ప్రకాశం జిల్లా టంగుటూరులోని ఓ పొగాకు కంపెనీలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగాకు బేళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేలకు పైగా పొగాకు బేళ్లు దగ్ధమయ్యాయి.
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే మొదట సంతోషించేది తానే అని అన్నారు.
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలవీరాంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు.. శ్రీ వేంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్ అండ్కోదేనని ధ్వజమెత్తారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.