Home » Ponnam Prabhakar
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ‘మహాలక్ష్మి’ పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు.
రాజ్యాంగ పరిరక్షణ, న్యాయం, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం పనిచేసిన ప్రజాసేవకుడిగా.. శివశంకర్కు గొప్ప పేరుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను విద్యార్థిగా రాజకీయల్లో ఉన్నపుడు శివశంకర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.
నకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రులకు తెలంగాణ మంత్రులకు మాటల యుద్ధం మొదలయ్యింది. బనకచర్ల ప్రాజెక్టును సమర్ధించుకుంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాకుండా ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నేతలు ఆందోళనలు చేయడం అత్యంత బాధాకరం.
తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రేషన్ కార్డులు రాని పేదలు దరఖాస్తు చేసుకుంటే పార్టీలకు అతీతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో రోడ్లు, విద్యుత్, ఇతర సమస్యలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎరువుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను దాచిపెడుతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు