Share News

ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:51 AM

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇకపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా విధి విధానాలను రూపొందిస్తోంది.

ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

హైదరాబాద్, మార్చి 24: దేశంలోని ప్రధాన నగరాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యానికి వాహనాల పెరుగుదల కూడా ఒక కారణమే. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) వినియోగం వల్ల కాలుష్యం ఉండదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహానాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మంగళవారం గుడ్‌న్యూస్‌ చెప్పింది.


ఈ ఈవీ వాహనాల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డిస్కౌంట్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అందుకు సంబంధించిన విధి విధానాలను ఈ రోజు మ.12 గంటలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జగిత్యాలకు పార్టీ పెద్దలు

నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ

For More TG News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 10:13 AM