Home » Politics
హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలని హరీశ్ రావు పిటిషన్ వేశారు.
విజయవాడ-సింగపూర్ మార్గంలో నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఊరట లభించనుంది.
గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండిపడ్డారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పిందని తెలిపారు.
విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపామని వివరించారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్షన్ చేసామని చెప్పారు. ప్రాపర్టీ అఫెన్సస్ ఎక్కువగా ఉన్నాయని.. వాటిలో పురోగతి ఆశించిన మేర లేదని చెప్పారు.
డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గో రక్షక్ దళ్ సభ్యుల కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నిన్న జరిగిన సోనూ సింగ్ పై కాల్పులను నిరసిస్తూ ధర్నాకు దిగారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదర్ పండుగను అధికారికంగా జరిపారని హరీశ్ రావు గుర్తుచేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ఇక్కడ వేదికను ప్రభుత్వమే వేసి.. దున్నలను తెచ్చిన వారికి వెండి బిళ్లలను ప్రభుత్వం తరపున అందించారని చెప్పారు.
కర్మను తప్పించుకోకగలమోమే గానీ, విద్యుత్ బిల్లుల మొతను తప్పించుకోలేమని.. మన బిడ్డలైనా కట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఒక రూపాయి వస్తువును ఎవడో మూడు రూపాయలకు కొని అవినీతికి పాల్పడితే వినియోగ దారుడు ఎందుకు భారం మోయాలి? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని హరీశ్ రావు చెప్పారు. తమ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళమని పేర్కొన్నారు. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్ లకే రిపోర్టులు పంపించే వాళ్ళమని చెప్పారు.