Home » Politics
వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు..! అంటూ ఒక ఫొటోను జోడించారు.
దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో, రోజుల్లో పరిష్కారం చూపుతోందంటూ పలువురు తమ పనితీరును ప్రశంసిస్తున్నారని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జాలు జరుగుతుంటే నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడంలేదని.. నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది.
రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని శంషాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మైనారిటీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు సోమవారం ఆటోలో కేటీఆర్ ప్రయాణించి మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. వారికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగకు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో వడ్డెర సంఘం నాయకులతో ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.
తెలంగాణ మద్యం టెండర్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది
తెలంగాణలోని మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రూ.2,780 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసింది.
కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే కర్నూలులోనే మరో బస్సు ప్రమాదం జరిగింది. ఈరోజు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.