High Court on Liquor Tenders: మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:47 PM
తెలంగాణ మద్యం టెండర్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: తెలంగాణ మద్యం టెండర్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేసిన ఐదుగురు వ్యాపారులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిచ్చారు. ఈనెల 18 నుంచి 23 వరకు రూ.5 వేల దరఖాస్తులే వచ్చాయని.. గడువు పొడిగించడం ప్రభుత్వ విధానపరమైన అంశమని ఏఏజీ న్యాయస్థానానికి విన్నవించారు. పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం.. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని ప్రశ్నించింది. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్ఖాన్ తెలిపారు. సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు కానీ.. కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా.. దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించారు. అయితే రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఫిర్యాదులు రావడంతో మద్యం షాపుల దరఖాస్తుల గడవును మరింత పెంచాలని ఎక్సైజ్ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఇవి కూడా చదవండి:
Adluri Challenge: అక్కడకు మేం వస్తాం.. మీరు వస్తారా.. హరీష్కు అడ్లూరి సవాల్
Kavitha Speech at Gun Park: క్షమించండి.. కవిత భావోద్వేగం