Home » Politics
న అరెస్ట్ పై వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తొలిసారి స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. తానేం నేరం చేయలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మాంసాభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు తనీఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులతో కలసి మాంసం విక్రయ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క మంచిపనైనా చేసిందా? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నామని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాష మార్చుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని.. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని చెప్పారు.
సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
నేటి యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు.
రాయ్పూర్ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో పీఎం సమావేశమయ్యారు.
కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే.. తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలో పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.1,031 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
జనగాం జిల్లా శంకర్ తండా సమీపంలోని కుంటలో యువతి శ్రావ్య మృతదేహం లభ్యమయింది. నిన్న బోళ్లమత్తడి వద్ద ప్రేమికులు బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య బైక్తో సహా నీటిలో కొట్టుకుపోయారు. చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ బయటపడగా, యువతి గల్లంతయ్యింది.