Home » Politics
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.
సామాజిక సమీకరణాలు, పార్టీ గెలుపు దృష్ట్యా అభ్యర్ధి విషయంలో బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాషాయ పార్టీ తరఫున ముగ్గురు పేర్లు కేంద్ర కమిటికీ అందాయి. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ బై పోల్ లో బీజేపీ అభ్యర్థిగా దీపక్రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందివ్వగా.. ఈ ముగ్గురి ఎంపికపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. మోదీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? అని ప్రశ్నించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని కవిత గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరినా ఆమోదం పొందలేదని తెలిపారు.
అక్రమ కేసులను నమోదు చేయడానికి గల కారణం ఏంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ హిందూ సభలో తాను మాట్లాడిన మాటలను పోలీసులు వక్రీకరించి కేసు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. హైరాదాబాద్ సిటీకి సంబంధం లేకుండా కేసు ఎలా పెడతారని లేఖలో ప్రశ్నించారు.
నవంబర్ నెల చివరి కల్లా వి హబ్ పనులు ప్రారంభం కావాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
టీవీకే ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని విజయ్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన తన రాజకీయ వ్యూహాలలో మార్పులు చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అవినీతి అనకొండలు అని ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల కోసం ఆలోచిస్తే....
శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగబద్ధమా, కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధమా అని చూడాల్సిన బాధ్యత గవర్నర్కులేదని తమిళనాడు ప్రభుత్వం వాదించింది...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారితో మమేకమైన పార్టీగా వచ్చే ఎన్నికల్లో నిరూపించబోతున్నట్టు విజయ్ వెల్లడించారు.