Home » PM Modi
రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన భారత్లో రెండో రోజు కొనసాగుతోంది. ఇండియాలో పర్యటించేందుకు ఆయన నిన్న(గురువారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ లైట్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి..
ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ఏఐ వీడియోల పరంపర కొనసాగుతోంది. గతంలో ఆయన్ను కించపరుస్తూ పలు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చాయ్ అమ్ముతున్నట్లు ఉన్న ఏఐ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్కు భారత ప్రధాని మోదీ భగవద్గీతను కానుకగా ఇచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం.. విందు సందర్భంగా ఈ పవిత్ర గ్రంథాన్ని అందజేసినట్టు తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగిన పుతిన్కు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమయ్యాక విపక్షాలు మరలా ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పునఃప్రారంభం కానుంది.
శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.
ఉడిపి రావడం తనకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని మోదీ అన్నారు. జన్సంఘ్కు ఇది కర్మభూమి అని, బీజేపీ సుపరిపాలనా మోడల్కు ప్రేరణ అని చెప్పారు. 1968లో ఇక్కడి మున్సిపల్ కౌన్సిల్కు జన్సంఘ్ నేత వీఎస్ ఆచార్యను ఎన్నుకున్నారని గుర్తుచేశారు.