Home » Phone tapping
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లో తొలి బాధితుడిని తానేనని.. తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. విచారణాధికారులు ఇచ్చిన ఫోన్ నంబర్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిసింది.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతికి కీలక ఆధారాలు అందినట్లు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు ఉన్నతాధికారి, బీఆర్ఎస్ నేత ఆర్.ఎ్స.ప్రవీణ్కుమార్ మాట మార్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫోన్ను ట్యాప్ చేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన ఆయన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ పోలీస్ ఉన్నతాధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హాజరయ్యారు. విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్కి సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.