Home » Penukonda
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.
స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్సఎ్స యూనిట్-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.
కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టు చీరలు చిరిగిపోయాయని చేనేత కార్మికులు వాగ్వాదానికి దిగారు. ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సును ఆపి, డ్రైవర్ను నిలదీశారు.
ఇన సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని శెట్టిపల్లి, కొండాపురం, రాంపురం, పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, మరువపల్లి, తిమ్మాపురం హైస్కూల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్కుమార్ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.