Home » Parliament
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని ఆయన విమర్శించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై వాడీవేడి చర్చ జరుగుతోంది. కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆయనకు అభినందనలు తెలియజేశారు.
పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ పురందేశ్వరి చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, పునర్విభజన బిల్లులను ఆమె స్వాగతించారు.
పార్లమెంట్ సమావేశాల్లో మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం లోక్సభ సీట్ల పెంపుపైనే ఆసక్తి కనబరుస్తోందని ఆమె విమర్శించారు.
కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
పార్లమెంట్ వేదికగా డీలిమిటేషన్ బిల్లుపై ప్రసంగించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారంటూ అసభ్య పదజాలం వాడుతూ ఘాటుగా విమర్శించారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించారు. కేవలం మౌలిక వసతుల కల్పనే వికసిత్ భారత్ కాదని.. మహిళలకూ అధికారం ఇవ్వాలని ఆయన అన్నారు.
దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులను ఎన్డీయే ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ప్రసంగించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు టీఎంసీ ఎంపీలు గైర్హాజరవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఎంపీలంతా హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని ఆయన కోరారు.