Home » Palla Srinivasa Rao
Palla Srinivas: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి రూ.11,400 సాయం రావడం అంత చిన్న విషయం కాదని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి కార్మికులు, నిర్వాసితులు పోరాటం మర్చిపోలేనిదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుపోతుందని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ. 11,400 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్న ప్రధాని మోదీ, ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవడానికి కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమినేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు.
Palla Srinivasa Rao: అసమర్థత, అవినీతి, ఆరోపణల మీద తప్ప మంత్రుల మార్పు ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉండదని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో నాలుగేళ్ల వరకు పదవి కాలం ఉంటుంది కనుక ..ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఆలోచన చేస్తామని అన్నారు.
పుష్ప-2 విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
సినిమా విడుదలైనప్పుడు హీరోలు వస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో హీరోలు వెళ్ళకపోవడమే మంచిదని ఏపీ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ట్విట్ అంతా అబద్దాల పుట్టగా ఆయన అభివర్ణించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తామని.. అలా చేయకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ప్లాంట్ పరిరక్షణ చేయకపోతే తాను పదవులకు రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్షలో కూర్చుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
Andhrapradesh: వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్.. నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు.
నాటి సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించగలుగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ అన్నారు.