Home » Palla Srinivasa Rao
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు మహత్తర కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు సైకిల్ యాత్ర చేపట్టనుందని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ఈసారి నిర్వహించే మహానాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కబోతోందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్లలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుతో అనుసంధానం కాబోతున్నారని పేర్కొన్నారు.
రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ట్రైన్లో విజయవాడకు చేరుకున్న మంత్రి.. అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజన్, పక్కా ప్రణాళికతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
నమ్మకంతో బీసీని అయిన తనకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
గద్దర్ అవార్డులపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఎంపిక కావడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు.