Home » Palla Srinivasa Rao
తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
పెట్టుబడిదారుల్లో వైసీపీ నాయకులు భయాందోళనలు పుట్టిస్తున్నారని పల్లా శ్రీనివాస్ అన్నారు. మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్పరం కావని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే 7,300 కోట్ల రూపాయలు కావాలన్నారు.
సూపర్ సిక్స్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.
వేలాది ప్రాణాలు బలిగొన్న విషపూరిత మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, ధర్నాల పేరుతో జగన్నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఏపీ వ్యాప్తంగా ఈరోజు చేపట్టామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డుపై ఆ నాయకుడు బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు.
అనంతపురం అర్బన్ పంచాయతీపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ హై కమాండ్ చర్చించింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ వద్ద అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాజరై వివరణ ఇచ్చారు.
జగన్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.
గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంగా పడి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.