Home » Pakistan
అమెరికాకు చెందిన టేలర్ అనే యువతి పాకిస్థాన్కు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతడి కోసం అమెరికా నుంచి పాకిస్థాన్ వచ్చేసింది. అతడిని పెళ్లి చేసుకుని పాకిస్థాన్లోని ఓ కుగ్రామంలో స్థిరపడిపోయింది..
పాక్ వైమానిక దాడులపై అఫ్గానిస్థాన్ మండిపడింది. తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పొరుగు విషయంలో సఖ్యతతో ఉండాలన్న కనీస ఇస్లామిక్ విలువను కూడా పాక్ మర్చిపోయిందని మండిపడింది.
అఫ్గానిస్థాన్లో తాజాగా పాక్ వైమానిక దాడులు చేసింది. సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించింది. ఉగ్రమూకలే టార్గెట్గా ఈ దాడులు చేశామని పాక్ సమాచార శాఖా మంత్రి తెలిపారు.
పాకిస్థాన్లో మరో పెద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా పౌరులూ మరణించినట్టు సమాచారం. వారిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.
టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. కొలంబో వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ భారీ ఎదురు దెబ్బ తగిలింది.
ఫిబ్రవరి 6వ తేదీన ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను నేవీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్లో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది.
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్-ఏ జట్టు ఫైనల్కు చేరింది. పాకిస్థాన్-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీస్ ఫైనల్కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్ను ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లామ్ ప్రభావితమయ్యారని ఆరోపించారు.