Home » Pakistan
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పలుచోట్ల భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మద్దతుదారులు 30మందికి పైగా మృతిచెందగా.. సుమారు 200మంది గాయపడినట్లు తెలుస్తోంది.
పీఓకే మళ్లీ నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జేఏఏసీ నేడు బంద్కు పిలుపునిచ్చింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణల్లో ఇప్పటికే 11 మంది మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు.
భారతదేశం తన అణ్వాయుధాల నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్ గతేడాది 180 అణ్వాయుధాలను కలిగి ఉండగా, ఈ ఏడాది మరో పదింటిని జోడించి 190కు చేరుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి దూత అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసించారు. ఏడాది క్రితం భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంలో ఆయనదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్కు భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమైనవని, తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నమని భారత ప్రతినిధి మండలి పేర్కొంది.
జపాన్లోని కవాగోయి నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక మసీదు వివాదానికి కారణమైంది. ఈ మసీదు ప్రారంభోత్సవానికి జపాన్లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
టీ20 ప్రపంచకప్-2016 ఛాంపియన్ వెస్టిండీస్ మహిళల జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా డబ్లిన్ వేదికగా జరిగిన విండీస్తో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది.
ఆన్లైన్లో ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన ఓ యువకుడు భారత భూభాగంలోకి చొరబడ్డాడు. వెను వెంటనే భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.
గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తముందని నిరూపించే కీలక ఆధారాలు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి లభించినట్లు సమాచారం. దాడికి సంబంధించిన అనుమానితుల కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీల్లో పాకిస్థాన్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది.