Home » Pakistan
బిహార్ ఎన్నికల తరువాత కూడా తమకు ఇతర పార్టీలతో పొత్తులు ఉండవని జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే, ప్రస్తుత పార్టీలకు మెరుగైన ప్రత్యామ్నాయంగా ప్రజలు తమను చూస్తున్నారని కామెంట్ చేశారు.
అఫ్గానిస్థాన్ను అడ్డం పెట్టుకుని భారత్ తమపై దాడికి యత్నిస్తోందని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. భారత్ చేతిలో కీలుబొమ్మగా అఫ్గానిస్థాన్ మారిందని కామెంట్ చేశారు.
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ సాహిర్ షంపాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు.
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
దోహా చర్చల్లో అనుకున్నట్టే రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నదే శనివారం నాడు ఇస్తాంబుల్లో శాంతి చర్చల ఎజెండాగా ఉందని ఏఎఫ్పీ తెలిపింది.
అమెరికాలో జరిగిన 2001 సెప్టెంబర్ దాడుల్లో కీలక సూత్రధారి అయిన ఆల్ఖయిదా వ్యవస్థాపకుడు ఒసామా బెన్ లాడెన్ను పట్టుకునేందుకు ఆ దేశం ఎంతగానో శ్రమించింది. దాదాపు 10 ఏళ్లు విస్తృతంగా గాలించి చివరకు తుదముట్టించింది.
భారతదేశాన్ని అనవసరంగా రెచ్చగొడితే పాకిస్థాన్కే ప్రమాదమని, భారత్తో జరిగే ఎలాంటి యుద్ధంలోనైనా పాక్ ఓడిపోతుందని సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియకౌ అభిప్రాయపడ్డారు. కిరియకౌ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో 15 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు.
నానాటికీ రెచ్చిపోతున్న పాక్కు భారత్ స్టైల్లో బుద్ధి చెప్పేందుకు అప్ఘాన్ సిద్ధమైంది. కునార్ నదిపై డ్యామ్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. నదీ జలాల నిలిపివేతతో పాక్కు బుద్ధి వచ్చేలా చేయాలని భావిస్తోంది.
అప్ఘానిస్థాన్తో సరిహద్దును మూసియవేడంతో పాక్లో కూరగాయలు, పండ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. టమాటాల ధర ఏకంగా 400 శాతం మేర పెరిగి 600 పాకిస్థానీ రూపయ్యాలకు చేరుకుంది.
టీటీపీ వరుస దాడులతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. అక్టోబర్ 8వ తేదీన ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రమ్లో టీటీపీ బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు టీటీపీ వెల్లడించింది.