Home » Pakistan
అఫ్గానిస్థాన్లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ సల్మాన్ అలీ అఘా రనౌటైన తీరు చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ రనౌట్ను రావల్పిండి ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాడుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో పాక్ ఆటగాళ్లకు పీసీబీ ఒక్కొక్కరికి రూ.50లక్షల జరిమానా విధించిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఆ వార్తలన్నింటినీ ఖండించింది.
పాక్ మిలిటరీ స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని తాలిబాన్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్లో పాక్ ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్తో తొలి వన్డేలో ఎదురైన ఘోర పరాభవానికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. నిన్న ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లండ్లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్2026’ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కావ్యా మారన్ నేతృత్వంలోని సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్పై భారత్ విజయం సాధించింది.
ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఉక్రెయిన్ తొలి స్థానంలో ఉంది. 2021-25 కాలానికి సంబంధించిన వివరాలను సిప్రీ తాజాగా బయటపెట్టింది.
ఇరాన్ భూ భాగంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాకిస్థాన్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్తో పాకిస్థాన్ 900 కి.మీ.లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై దాడులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా తీవ్రంగా ఖండించారు.