Home » NTR District
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటపల్లె పంచాయతీ షికారుపాలెంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వివాహేతర సంబంధం నెపంతో కొందరు ఆమెను వివస్త్రను చేసి అనంతరం చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు.
Andhrapradesh: నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... సమస్యలపై ఒకసారి మీ అందరితో మాట్లాడి తెలుసుకోవడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు.
అమరావతి: ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు.
వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ రూరల్ పి. నైనవరం, నున్న నుంచి వేళంకిణికి 70 మంది గ్రామస్తులు పయనమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే వేళంకిణికి వస్తావని మొక్కుకున్నామని నైనవరం గ్రామస్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరిందని, టీడీపీ నాయకుడు దేవేంద్ర ఆధ్వర్యంలో 70 మంది నైనవరం గ్రామస్తులు వేళంకిణికి బయలుదేరి వెళ్లారు.
ఎన్టీఆర్ జిల్లా: బూధవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ వద్ద ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆవాల వెంకటేశ్ (35) మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వారితో కలిసి మాట్లాడారు.
సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఇసుక ఉచితం(Free Sand)గా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సృజన(Collector Srujana) వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది స్టాక్ పాయింట్లలో 5లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని ఆమె వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు ఆధార్ కార్డుతోపాటు, దిగుమతి చేసుకునే చిరునామా వివరాలు అందించాలని సూచించారు.
జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ (Budawada) లోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ (Ultratech cement factory)లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.
Andhrapradesh: నిరు పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారు. అనేక విధాలుగా రేషన్ అక్రమ రవాణాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఎక్కడో చోట బియ్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట జాతీయ రహదారిపై వెనుగంచి ప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అను మానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరింది. లారీ డ్రైవర్ కనగాల అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వస్తున్నారు.