Home » NTR District
రైతులంతా సంఘటితమయ్యారు. చేయిచేయి కలిపారు. రూ.35 లక్షల నిధులు సమీకరించుకున్నారు. బుడమేరు వరదలకు దెబ్బతిన్న బెడ్ డ్యాంను తిరిగి పునర్నిర్మించుకున్నారు.
మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు.
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న మృతిచెందారు. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని గుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజాదర్బారు’ నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి ఫొన్ తీసుకున్న మాయగాడు క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయాడు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావుతో పాటు మరికొందరిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద 'యోగాంధ్ర'లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశా పాల్గొన్నారు. జూన్ 21న జరిగే యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరంలో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను నాగబాబు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర 2026 నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికీ యోగాను చేరువ చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.