Home » NRI Latest News
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పాటలు, ఆటల పోటీలు వంటి కార్యక్రమాలు ఎన్నారైలను అలరించాయి.
న్యూజెర్సీలో జరిగిన నారీ శక్తి కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు మాధవీ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం విశిష్టత గురించి ప్రసంగించారు. ధర్మ పరిరక్షణలో మహిళ పాత్ర గురించి పేర్కొన్నారు.
మెల్బోర్న్లో ఎన్నారైలు సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
న్యూజెర్సీలోని ఎన్నారైలతో నేడు తెలంగాణ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో డాలస్లో కూడా ఆమె పర్యటిస్తారని జీహెచ్హెచ్ఎఫ్ అధ్యక్షుడు తెలిపారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. డాలర్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రమాణస్వీకారం చేశారు. తనకీ బాధ్యత అప్పగించిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఖతర్లోని తెలంగాణ ప్రముఖురాలు నందిని అబ్బగౌనికి నారీ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బహ్రెయిన్లో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వైభవంగా సాగాయి. ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణుడి నామస్మరణతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ యువ వాలంటీర్లు భారీ స్థాయిలో ఆహారాన్ని విరాళంగా సేకరించి అవసరమైన వారికి అందజేశారు. 7 వేల పౌండ్ల ఆహారాన్ని అందించి రికార్డు సృష్టించారు.
అమెరికా ప్రభుత్వం మరో షాకిచ్చింది. వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు ప్రకటించింది. కొత్త చార్జీలు మార్చ్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.