Home » New Delhi
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో నక్సల్స్తో పోరాడిన సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు, డీఆర్జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించడం జరిగిందని అమిత్షా తెలిపారు.
2024 డిసెంబర్ 31 లోపు వివిధ కారణాలతో భారత్కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ శరణార్ధుల వద్ద పాస్పోర్ట్, ఇతర పత్రాలు లేకున్నా భారత్లో ఉండేదుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుండి ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'నెక్స్ట్-జెన్' జీఎస్టీ సంస్కరణలు..
గత జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేసారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇండియా ఎవరినీ శత్రువుగా భావించదని, ఇదే సమయంలో ప్రజల ప్రయోజనాలకు భంగం కలగనీయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
చైనాలో ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సోమవారంనాడు చర్చలు జరుపుతామని క్రెమ్లిన్ అధికారి యూరి ఉషకోవ్ తాజాగా తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ డిసెంబర్ పర్యటనకు సంబంధించిన సన్నాహకాలపై ఉభయ నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ప్రతి భారతీయ జంటకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూడు కంటే తక్కువ జనన రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని ఆయన చెప్పారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు మొత్తం 45 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.
భారత్పై ప్రస్తుతం 25 శాతం టారిఫ్లు అమలవుతుండగా, బుధవారం నుంచి అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు జరుగనున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.