Home » Nellore
మరో ఘటన బీమిలీ పట్టణంలో చోటుచేసుకుంది. సరగడ అప్పలరెడ్డి (42) అనే వ్యక్తి బీచ్లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటమునిగారు. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు.. ఆయనను పట్టుకుని ఒడ్డుకు చేర్చి.. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నెల్లూరులోని భగత్సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. 20 ఏళ్లకు పైగా అక్కడే ఉంటున్న 1400 కుటుంబాలకు మంత్రి నారాయణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.
లారీని తుపాన్ వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతిచెందారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. రాయలసీమలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తుండగా, కోస్తాలో
నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పని చేసుకుంటున్న ఓ గ్రామస్థుడిని విచారణ పేరుతో బలవంతంగ పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది.
మాజీ సీఎం జగన్ ఎక్కడ పర్యటన వెళ్లినా.. ఆ పర్యటన ఓ వివాదంగా మారుతోంది. తాజాగా ఆయన నిన్న చేసిన నెల్లూరు పర్యటనలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ.. పలువురి వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ కోసం థియేటర్లో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు థియేటర్ నిర్వాహకులు..
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో రైలుయాత్ర వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.