Home » NEET Exam
జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.
జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేతగానితనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు.
నీట్ యూజీ రీఎగ్జామ్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ పున:పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలనే పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల రవాణాకు ఎయిర్ఫోర్సు సాయం తీసుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ లీక్ కేసుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గత వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్వకపోవడంపై ఎన్టీఏ తీరును తప్పుపట్టింది.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పేపర్ లీకైన వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఈ పరీక్ష నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ....
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- 2026 ప్రశ్నపత్రం లీకైన నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. పరీక్షా వ్యవస్థలోనే ఉన్న 'ఇన్సైడర్లు' ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేసి, మధ్యవర్తుల ద్వారా దేశంలోని పలుచోట్ల విద్యార్థులకు విక్రయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
నీట్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీషా మంధారేకు కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.