Home » NDA Alliance
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శనివారం) సాయంత్రం మహిళల గురించి మాట్లాడారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.
నియోజకవర్గాల పునర్విభన బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి, పేదలకు అన్నం లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని.. పేదల సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది.
కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారు మినహా.. రాష్ట్ర ప్రజలు దీనిని దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు.
కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టు గెదర్ని తలపించింది. ఈ విందులో నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో నిర్వహించిన విందు సమావేశం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా సాగింది. శుక్రవారం లోకేశ్ ఉండవల్లి నివాసంలో రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు..
ఏపీ ఎన్డీఏ కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శాసనమండలిలో వైసీపీ సభ్యులు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలతో చేసిన మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి..