Home » National News
రైల్వే అధికారులపై బ్లేడుతో దాడి చేసిన కేసులో మోడల్, వెబ్సిరీస్ నటి అంతరా బెనర్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 12న ఆరావళి ఎక్స్ప్రెస్లో ఆమె విచక్షణారహితంగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు.
జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్ట్-75(ఐ) ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.70,000 కోట్లు.
బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్ సుమంత్ జైన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుతోంది. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో చేసిన 'నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యకు స్పందిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం గేయాలాపనపై రాజకీయ వివాదం చెలరేగింది. వందేమాత్రం పూర్తి గేయాన్ని ఆలపించడాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది.
ఏ పని చేసినా ఎంతో జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలని యువ ఇంటర్న్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఇంటర్న్షిప్ చేస్తున్న యువతతో న్యూఢిల్లీలో నిర్మలా సీతారామన్ తాజాగా సమావేశమయ్యారు.
ఉత్తరాఖండ్ చమోలి జిల్లా పిపల్కోటిలోని టీహెచ్డీసీ సొరంగంలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. శిథిలాలు, నీటిని తొలగించిన సహయక సిబ్బంది మరో మృతదేహాన్ని వెలకితీశారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు.
బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.