Home » National News
తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగంపై తమిళగ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి డీఎంకే పాల్పడుతోందని అన్నారు.
కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.
బీఎన్పీ నుంచి హిందూ అభ్యర్థిగా ఢాకా-3 నుంచి పోటీ చేసిన గయేశ్వర్ చంద్ర రాయ్ ఈ ఎన్నికల్లో తన సమీప జమాతే-ఇ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షహినూర్ ఇస్లాంపై విజయం సాధించారు.
రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్పీ ఘనవిజయం సాధించడంతో తారిఖ్ రెహ్మాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది నిర్ణయాత్మకమైన గెలుపుగా అభివర్ణించారు.
బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలకు పరిశీలకులను పంపాలని భారత్కు అధికారిక ఆహ్వానం అందిందని, అయితే దీనికి దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు.
లోక్సభలో తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తనపై సభా హక్కుల తీర్మానం పెట్టినా వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.
రౌడీ షీటర్ బిక్లు శివ హత్యకేసులో నిందితుడైన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
తాను తండ్రి కాకుండా ఉండేందుకు క్షుద్ర పూజలు చేశారనే అనుమానంతో పొరుగింట్లో నివాసం ఉండే దంపతులను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో చోటుచేసుకుంది.
సల్మా అనే జర్నలిస్ట్ హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మా హత్య కేసులో ఇటీవలే ప్రత్యక్ష సాక్షి కోర్టుకు హాజరై.. అసలు నిజాలను వెల్లడించింది.