Home » National News
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 'శ్రామిక్ న్యాయ్' హామీని పునరుద్ఘాటించింది. రోజుకు రూ.400 చొప్పున జాతీయ కనీస వేతనం కల్పించడం తమ వాగ్దానమని, ఇదే నిజమైన '400 పార్' అని తెలిపింది.
ముంబై: మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.
రూ.2.74 లక్షల కోట్ల ఆస్తులున్న 127 ఏళ్ల గోద్రెజ్ కుటుంబం(Godrej Family) ఇప్పుడు రెండు భాగాలుగా(split) విడిపోయింది. విభజన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. దీంతో గోద్రెజ్ కుటుంబంలోని రెండు శాఖల మధ్య చీలికలో ఒకవైపు ఆది గోద్రెజ్, ఆయన సోదరుడు నాదిర్ గోద్రెజ్, మరోవైపు వారి బంధువులు జంషెడ్, స్మిత ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ద్వారక(Dwarka)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది.
‘‘నీకన్నా వయసులో పెద్దదాన్ని.. నన్నేం చేయకు. మీ నాన్నకు, తాతకు నాచేత్తో అన్నం వడ్డించాను. అమ్మలాంటిదాన్ని..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల(commercial LPG cylinder) రేట్ల తగ్గింపు విషయంలో కొంత ఉపశమనం లభించింది. దీంతో నేటి(మే 1) నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర రూ.19 తగ్గింది. ఇది వాణిజ్య సిలిండర్ల రేట్లలో మాత్రమే LPG రేటు తగ్గించబడింది. ఈ నెల డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం చేతగాని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు.
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరీ లోక్సభ ఎన్నికల తేదీపై ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంతవరకూ రెండు విడతల పోలింగ్ పూర్తికాగా, ఈ రెండు విడతల్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు విడుదల చేసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం నమోదైనట్టు వెల్లడించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు, సమాజ్వాదీ పార్టీ నేత మారియా ఆలం ఖాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. మతం పేరుతో ఆమె ఓట్ల అడగడంపై ఎఫ్ఐఆర్ నమోదైంది.