Home » National News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. రామ మందిర విరాళాల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.
దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమైంది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బ్యూటీషియన్ నిషా చౌహాన్ హత్య సంచలనం సృష్టించింది. భర్త ప్రదీప్ చౌహాన్ ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రముఖ పాండవాణి ఫోక్ సింగర్ తీజన్ బాయి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.
సినిమాలు, వెబ్సిరీస్లు, ఓటీటీ కంటెంట్ అక్రమంగా ప్రసారం అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ టెలిగ్రామ్కు నోటీసులు జారీ చేసింది.
ముంబై అహల్యానగర్లోని రాహురి ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న బస్సు కొండ్వాడ్ సమీపానికి రాగానే అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.