Home » National News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటం కమలనాథులను షాకింగ్కు గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీజేపీ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని శుక్రవారంనాడు ఏర్పాటు చేసింది.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు కీలక తీర్మానం జరిగింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తాము కాపాడుకుంటామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
నక్సల్ రహిత భారత్ లక్ష్య సాధనపై కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. దేశ అంతర్గత భద్రతలో భాగంగా హోం శాఖ కీలక మైలురాయిని చేరిందని ప్రకటించింది. ఈ మేరకు నక్సలిజం అణచివేతపై నివేదికను విడుదల చేసింది.
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా తాజాగా శరద్ పవార్ ఎన్సీపీ-ఎస్పీ సైతం ఆ దిశగానే వెళ్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అసాంఘిక కార్యకలాపాల కోసం టెలిగ్రాం యాప్ను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని ...
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
జెరోదా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగితో పందెం కాసి రూ.2.5 లక్షలు కోల్పోయానని తెలిపారు.
జార్ఖండ్లోని రెండు రాజ్యసభ స్థానాలకు నేడు (గురువారం) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక స్థానాన్ని ఎన్డీయే (NDA) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ కైవసం చేసుకోగా.. మరో స్థానాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి బైద్యనాథ్ రామ్ దక్కించుకున్నారు.