Home » National News
యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. P2P యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితమని క్లారిటీ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు చేస్తున్న యువతను కలవడానికి ప్రధానమంత్రికి సమయం ఉండటం లేదని, కానీ తమ పార్టీని వీడి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన ఎంపీలను కలవడానికి మాత్రం సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ఓ యువతి సోషల్ మీడియాలో యువకులను ఆకర్షించి కోట్లు వసూలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్కు చెందిన ఓ హైకోర్టు న్యాయవాది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
జుట్టు పెంచుకోవాలన్న ఆమె పట్టుదల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8.10 అడుగుల పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు.
పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసిన శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల రహదారులు కుంగిపోవడం, పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు ప్రయాణికులను తీవ్రంగా వేధిస్తున్నాయి. మొన్న లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన కొన్ని రోజులకే పగుళ్లు ఏర్పడగా.. తాజాగా ఆగ్రాలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది.
దేశ రాజధానిలో ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు.
కల్తీ, నకిలీ పాల ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కృత్రిమంగా తయారు చేసిన పనీర్, నెయ్యి, వెన్న తదితర నకిలీ డెయిరీ ఉత్పత్తుల తయారీ సహా వాటి నిల్వ, రవాణా, విక్రయాలపై నిషేధం విధించింది.
మహిళా రిజర్వేషన్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా పరస్పరం స్పందించారు.